కేంద్ర బలగాల మోహరింపు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు మమత సర్కార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా శనివారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరఫు సీనియర్ అధికారులు శుక్రవారంనాడు సమావేశమై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం 48 గంటల్లోగా కేంద్ర బలగాలను మోహరించేలా చూడాలంటూ కోల్‌కతా హైకోర్టు గత బుధవారంనాడు ఎస్ఈసీకి ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో హింస చెలరేగడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ, జూన్ 13న తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ సమర్ధవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది.

బీజేపీ ఫిర్యాదు

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర బలగాలను మోహరించేలా తగిన ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేతలు సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హైకోర్టును ఇంతకుముందు ఆశ్రయించారు. 2022 మున్సిపల్ ఎన్నికల్లోనూ, 2021లో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పెద్దఎత్తున హింస చెలరేగిన ఘటనలను తమ పిటిషన్లలో వారు కోర్టు దృష్టికి తెచ్చారు.

Leave A Reply

Your email address will not be published.