కలుపుడే కాదు రిజర్వేషన్లు పెంచాల్సిందే

- రిజర్వేషన్లు పెంచకుండా బీసీ కులాలను ఏ విధంగా కలుపుతరు..? - బిసి జాబిత దర్మం సత్రం అనుకున్నార...? -  జాతీయ బిసి కమిషన్ నిర్ణయం పై జాజుల శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబిత లో ఉండి కేంద్ర జాబితాలో లేని కులాలను ఓబిసి జాబితాలో కలిపితే ఎవ్వరికీ అభ్యంతరం లేదని,కాని ఏలాంటి అర్హత లేని  కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో కలుపుతే సహించేది లేదని బిసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన లో కేంద్రాన్ని హెచ్చరించారు.  నిన్న డిల్లిలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఆన్సరాజ్ గంగారాం హైర్ దేశ వ్యాప్తంగా 80 కులాలను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్లు ప్రకటించారని, రోజుకొక కూలాన్ని బిసీ జాబిత లో కలుపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసీ రిజర్వేషన్లను మాత్రం ఒక్క శాతం కూడ ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు.    కేంద్ర ప్రభుత్వానికి జాతీయ బీసీ కమిషన్ కు చిత్తశుద్ధి ఉంటే రోజుకు ఒక కులాన్ని కలుపుతూ బీసీ రిజర్వేషన్లు మాత్రం ఒక్క శాతం కూడా పెంచకపోవడం వలన ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ కులాలకు,ఇదే సమయంలో ఓబీసీ జాబితాలో చేరబోయేటువంటి కొత్త కులాలకు కూడా న్యాయం జరగదని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే 2650 బీసీ కులాలు ఉంటే జనాభాలో 60 శాతం ఉన్నటువంటి బీసీ కులాలకు కేవలం దేశవ్యాప్తంగా 27%,రాష్ట్ర0 లో 29%  రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇందులో కూడ బీసీ క్రిమిలేయర్ విధించి రిజర్వేషన్లకు కోత పెడుతున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.    నిజంగా కేంద్ర ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే ఇతర సామాజిక వర్గాలకు అలాగే అగ్రవర్ణాలతో సహా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం, బీసీలకు మాత్రం జనాభ దామాష ప్రకారం ఎందుకు కల్పించడం లేదన్నారు. బిసిలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి , కొత్తగా బీసీ కులాలను కలిపితే అందరికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కూడ వివిధ రాష్ట్రాల మాదిరిగా బీసీలకు ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం మూలంగా దేశంలోని అత్యంత వెనుకబడిన వాళ్లకు, సంచార జాతులకు  అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో బీసీ జాబితాలో ఉన్న కులాల కంటే… అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కులాలకే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమానమైనటువంటి అవకాశాలు దక్కుతున్నాయని, బీసీలకు మాత్రమే సమాన అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి 80 కులాలను కలుపుతామని జాతీయ బిసి కమిషన్ నిర్ణయం తీసుకోవడం వలన   బీసీ రిజర్వేషన్లు మూరెడు..బిసి జాబితా బారెడుగా మార్చారని,దీనివల్ల ఏ కులానికి,ఎవరికి ప్రయోజనం .ఉండదని, పళ్లెంలో పాలు పోసి కొంగలను తాగమనట్టుగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు .బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ రాజకీయంగా కర్ణాటక తరహలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.