రైతు కుటుంబాలకు ధీమా రైతు బీమా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/బీర్కూర్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు కుటుంబాలకు ధీమా కల్పించడానికి రైతుభీమా పథకం అమలు చేస్తున్నారని తెరాస సీనియర్ నాయకులు మాజి జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ తెలిపారు. బీర్కూర్ మండలం మల్లాపూర్, భారంగేడఘీ, బస్వపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఇటీవల మృతి చెందడంతో రైతుభీమా కింద మంజూరు అయినా 5లక్షల రూపాయల ప్రొసీడింగ్లను వారి వారసులకు అందచేశారు. బస్వపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సాయవ్వ మృతి చెందగా కుమారుడు శ్రీనివాస్ కు, భరంగేడఘీ గ్రామానికి చెందిన రైతు రమేష్ మృతి చెందాగా భార్య సంగీత కు అదేవిదంగా మల్లాపూర్ గ్రామానికి చెందిన మంగలి గంగారాం మృతి చెందగా కుమారుడు శంకర్ లకు గురువారం రోజు 5లక్షల రైతుభీమా ప్రొసీడింగ్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో భైరపూర్ పాక్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గాదె మోహన్, నీరడి శ్రీనివాస్, లబ్ధిదారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.