ఏపిలో జూన్ 24 వరకు ఒంటిపూట బడులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఒంటిపూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 24 వరకు ఏపీలో ఒంటిపూట బడులు ఉంటాయని తెలిపింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల్లో తరగతులు జరుగుతాయని విద్యాశాఖ పేర్కొంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేస్తారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్లు తెలిపింది.