నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా!: కొండా మురళి

- తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ నేత కొండా మురళి-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌ లో మొదలైన విమర్శలు పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు. మురళి-బీఆర్‌ఎస్ నేతలు తగ్గేదేలే అన్నట్లుగా సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలపై మురళి ఈ రోజు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడని తెలిపారు. సీఎం కేసీఆర్ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నాడు కాబట్టే కవిత అరెస్ట్ కాలేదని చెప్పారు. ‘‘నాకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్రెడ్డి ని కలిసి పరకాల టికెట్ అడుగుతా. అధిష్టానం ఒప్పుకుంటే పరకాలలో నేనే నిలబడతా. కొండా సురేఖని వరంగల్లో గెలిపిస్తా.. నేను పరకాలలో గెలుస్తా. నంది పైపులు అమ్ముకునే ధర్మారెడ్డి.. నన్ను బ్రతిమాలి పెద్ద కాంట్రాక్టు తీసుకున్నాడు’’ కొండా మురళి తెలిపారు.

నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా!

నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా.. నన్ను రౌడీ అంటున్నావు.. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది. శ్రీకృష్ణదేవరాయులు వంశంలో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు ఆడది కాదాయే.. మొగోడివి కాదాయె.. మీసాలు లేక ఎవరో తెలియకపాయె.. మీసాలుంటే మెలేస్తే బుద్ధివంతుడివిధైర్యవంతుడివి అనుకునేవాళ్లం’ అని కొండా మురళికేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.