అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ప్రజలు టీవీల్లో వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఏటా ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తులు భారీగా కల్యాణోత్సవానికి విచ్చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.అయితే, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం చేస్తున్నారు. చివరిగా రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు. అంతటితో అమ్మవారి కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

Leave A Reply

Your email address will not be published.