గడపగడపకు వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వారిని
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్లో పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన సీఎం… కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్టి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని అన్నారు. ‘‘వీరందరికీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను.. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను’’ అని హెచ్చరిక జారీ చేశారు. ఈసారి వర్క్షాపులో ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోకపోవడంపై చర్చ జరిగింది. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు. ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు వెళ్లి కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. వారు అడిగిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి హితవు చేశారు. జనం అడిగిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అధికారులు కూడా వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.