గ్రూప్ 1 రద్దు చేయాలని హైకోర్టులో మరో పిటిషన్
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నెంబర్, ఫొటో లేకుండానే OMR షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సాఫీగా ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. టీఎస్పీఎస్సీ (లో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.నిబంధలను కఠినంగా అమలు చేశారు. గత గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోగా ఈసారి అలా చేయలేదు.