కనుమరుగవుతున్న ప్రాచీన కళలను ప్రోత్సహించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూర్ గ్రామం లో శ్రీ రామాంజనేయభజన మండలి అధ్యక్షులు పంతులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలోశ్రీ శ్రీ శ్రీ మద్వి రాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు రోజులనాటక ప్రదర్శన లో భాగంగా మొదటి రోజునాటక ప్రదర్శన కు జడ్చర్ల మండలం, బూర్గుపల్లి గ్రామ శ్రీ కృష్ణ కళా మండలి సభ్యులు హాజరై  బూదేవి పాత్ర దారు ని అభినందించారు, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న ప్రాచీన కళలను శ్రమ కోర్చి ప్రదర్శిస్తూ జీవం పోయడం అభినందనీయమని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి కళాకారులకు నాటక ప్రదర్శనకు ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని, ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ కళామండలిసభ్యులు,మల్లేష్ యాదవ్,చెన్నయ్య స్వామి, రామస్వామి, మేడిపురి నర్సిములు,కృష్ణయ్య, గొడుగు రాధాకృష్ణ పరమేష్ యాదవ్, చిరు యాదవ్, బాబు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.