తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. లఖానా గ్రామంలో భద్రతా దళాలు డ్రోన్ను నేలకూల్చాయి. భారత గగన తలంలో ప్రవేశించిన పాకిస్థానీ డ్రోన్(DJI మ్యాట్రిస్ 300 RTK) ను BSF దళాలు పేల్చివేసినట్లు పంజాబ్ BSF దళాలు తెలిపాయి.కాగా..జూన్ 22న ఫజిల్కా ప్రాంతంలో భద్రత దళాలు డ్రోన్, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారంతో ఫజిల్కా జిల్లాలోని జోధావాలా గ్రామంలోని సరిహద్దుల్లో 2 కిలోల హెరాయిన్, పాకిస్థానీ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.