క్రైస్తవులకు క్రైస్తవ సమాజానికి బిజెపి అండ

-    బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: క్రైస్తవులకు క్రైస్తవ సమాజానికి మేము అండగా ఉంటామని వారి సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి మేము ముందుంటామని మాజీ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి గారు తెలిపారు శనివారం నాడు సికింద్రాబాద్లో జరిగిన భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా క్రిస్టియన్స్ సువిదా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమస్యలను క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిమాండ్లను  ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా గారి దృష్టికి తీసుకువెళ్లనట్లు ఆయన తెలిపారు  అంతకుముందు  క్రైస్తవ సంఘాల నాయకులు పాస్టర్లు బిషప్ లు మాట్లాడుతూ  క్రైస్తవులు తమ కొరకు తమ ఇళ్ల కొరకు తమ ఆస్తుల కొరకు కాకుండా తమ పట్ల వేధింపులను అరికట్టాలని తాము కొనుక్కున్న స్థలాలలో చర్చి నిర్మాణం కొరకు అనుమతులు ఇవ్వాలని తాము చేపట్టే కార్యక్రమాలకు అడ్డంకులు కలిగించకుండా చూడాలని నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హాలు మరియు చనిపోయిన వారి కొరకు సమాధుల తోటలను ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఎఫ్సీఆర్ఐ నిధులను అడ్డుకోకుండా చూడాలని కోరారు తామందరము భారతీయ జనతా పార్టీని అని కాకుండా భారతీయ జీసస్ పార్టీ అని మేము భావిస్తామని తెలిపారు అనంతరం రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సరపాషా మాట్లాడుతూ క్రైస్తవులు సేవాగుణంలో ముందు ఉంటారని విద్యా వైద్యం విషయంలో వారు చేసిన సేవలు మరువరాని అని కొనియాడారు అంతేకాకుండా రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి తీసుకు వెళ్లడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఉపాధ్యక్షులు భరత్ రెడ్డి ఐజాక్ రాజ్ జూలీ శ్రీధర్ అబ్బాస్ సైదులు ఇండిపెండెంట్ చర్చెస్ అధ్యక్షులు బిషప్ దయానంద్ పాస్టర్ సుదర్శన్ పాస్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.