కర్నూలులో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కర్నూలులో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య కలకలంరేపింది. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి లోకేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. లోకేష్ తండ్రి బ్రహ్మానందరావుకి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదువుల ఒత్తిడితోనా, ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ మొబైల్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.. కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు. అతడి మిత్రులను కూడా పోలీసులు ప్రశ్నించారు.. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. లోకేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి కాగా.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అతడి ఆత్మహత్యతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.