‘కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఉప ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతి ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ ఓటర్లను కొనేస్తుందని ఆరోపించారు. ‘కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ప్రమాణాలు చేయించుకుని ఓట్లు వేయించుకునే చరిత్ర కేసీఆర్‌ది. 2014 నుంచి ప్రతి ఉప ఎన్నికలో కేసీఆర్ రూ. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆఖరికి పట్టభద్రుల ఎన్నికలలో కూడా ఒక్క హుజురాబాద్ ఉపఎన్నికల్లో రూ. 4,600 కోట్లు నా మీద టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. కేసీఆర్ సమాధానం చెప్పాలి. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. కాని దేశానికి ఏం సందేశం ఇద్దామని? టీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ. 870 కోట్లు డబ్బు ఎక్కడిది’’ అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.