ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరో వైపు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Leave A Reply

Your email address will not be published.