జూన్ 30వ తేదీలోపు పాన్ కార్డు ఆదార్ లింక్ చేసుకోవాలి

- పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు పాన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయకపోతే.. తర్వాత ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను రీఫండ్ నిలిపేయనున్నారు. అలాగే టీసీఎస్, టీడీఎస్‌కు అధిక ఛార్జీలు వసూలు చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 30వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు సబంధించిన వివరాల్లోకి వెళితే. ఆధార్ కార్డుతో పాన్‌ కార్డు లింక్ చేయడాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ తప్పనిసరి చేసింది. ఇందుకోసం మార్చి 31 చివరి తేదీగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడుపు తేదీని జూన్ 30వరకు పొడిగించారు. ఈ గడువు కూడా దాటిపోతే రూ.1,000 అపరాధ రుసుముతో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే పాన్ కార్డులు ఇకపై పని చేయవని ఆదాయ పన్ను శాఖ  స్పష్టం చేసింది. 2023 ఫిబ్రవరి నాటికి 13 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఆధార్‌కి లింక్ చేసుకోకపోవడం గమనార్హం. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే.. ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది….

Leave A Reply

Your email address will not be published.