వివాదం సద్దుమణిగిన… ఆత్మగౌరవం కోసం పోరాడతా

- : సర్పంచ్ నవ్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్టేషన్‌ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యతో జానకిపురం సర్పంచ్ నవ్యకు ఉన్న వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. జానకిపురం సర్పంచ్ నవ్యకు రూ. 25 లక్షల సీడీఎఫ్ నిధుల ప్రోసిడింగ్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తామని సర్పంచ్ నవ్య చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య వద్ద తన భర్త తీసుకున్న రూ. 7 లక్షలు తిరిగి ఇస్తామని నవ్య వెల్లడించారు.

గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటి వరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదనిగతంలో జరిగిన గొడవకు ఎమ్మెల్యే రాజయ్య తనకు క్షమాపణలు చెప్పారని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. తాము ఏనాడు డబ్బుల కోసం ఆశ పడలేదనిఆత్మగౌరవం కోసం పోరాడతామని నవ్య వెల్లడించారు. తాము ఆస్తులను అమ్ముకుని గ్రామ అభివృద్ధి చేస్తున్నామని ఆమె తెలియజేశారు. తాను చట్టప్రకారం పోరాడతాననిజాతీయరాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా ఎమ్మెల్యే రాజయ్యపై పోరాటం కొనసాగిస్తానని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.