అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పర్చూరి సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరులు టీడీపీలో చేరనున్నారు. సుభాష్ చంద్రబోస్‌తో పాటు అవనిగడ్డ, కోడూరు మండలాల నుంచి చేరికలు ఉండనున్నాయి. మంగళగిరిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సుభాష్ చంద్రబోస్, మిగిలిన నేతలు పార్టీలో చేరనున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని తెలుగుదేశంలో చేరున్నట్లు తెలిపారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నేతలంతా మంగళగిరి బయలుదేరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.