పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డా.ఎన్.సత్యనారాయణ పదవి విరమణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు డా.ఎన్.సత్యనారాయణ పదవి విరమణ సందర్భంగా ఆయనను మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ విభాగంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన విశేష సేవలు అందించారని, కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఆయన నిర్విరామంగా కృషి చేశారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన సందర్భంగా ఆయనను కూడా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.