తలకోన జలపాతం లో యువకుని మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: యూత్‌లో సోషల్ మీడియాలో లైక్‌ల పిచ్చి పట్టుకుంది. సరదాగా ఓ వీడియో చేసి అలా అప్‌లోడ్ చేయగానే లైక్‌లు, షేర్‌లు, వ్యూస్ వచ్చి పడాలని ఆశపడుతుంటారు. ఈ పిచ్చిలో ఒక్కోసారి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు బైక్‌పై, రైలు ట్రాక్‌పై స్టంట్‌లు చేసి వీడియో చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో కూడా విషాద ఘటన జరిగింది. తలకోనలో కర్ణాటకకు చెందిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.తిరుపతి జిల్లా యర్రావారి పాలెం మండలం తలకోన దగ్గర జలపాతాలు ఉన్నాయి. కర్ణాటక మంగుళూరు కి చెందిన సుమన్ స్నేహితులతో కలిసి శుక్రవారం నాడు సరదాగా తలకోన జలపాతానికి వచ్చాడు. సరదాగా ఓ రాయి పై నుంచి కిందకు దూకుతుండగా తోటి స్నేహితుడు వీడియో తీశాడు. కొంతసేపటి తర్వాత ఈత కోసం దిగిన సుమన్ బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. సుమన్ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు యర్రావారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.శుక్రవారం చీకటి పడటంతో గాలించడం కుదరలేదు. శనివారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలించి సుమన్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వీడియో వైరల్ అవుతోంది. జలపాతం దగ్గర ఓ రాయిపై నుంచి దూకుతుండగా.. తోటి స్నేహితుడు వీడియో తీశాడు

Leave A Reply

Your email address will not be published.