ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కలకలం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ప్ర‌ధాని మోదీ (PM Modi) నివాసం డ్రోన్ ఎగ‌ర‌డం క‌ల‌క‌లం సృష్టించింది. సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా.. ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు దిల్లీ (Delhi) పోలీసులు వెల్ల‌డించారు. తెల్ల‌వారుజామున ప్ర‌ధానికి భ‌ద్ర‌త క‌లిపించే ఎస్పీజీ సిబ్బంది మోదీ నివాసం డ్రోన్ త‌చ్చాడ‌డాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో త‌క్ష‌ణం వారు రంగం లోకి దిగి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
అయితే వారికి డ్రోన్ చిక్క‌లేద‌ని స‌మాచారం. స‌మాచారం అందుకున్న వెంట‌నే గాలింపు చేప‌ట్టాం. అయినా ఎలాంటి డ్రోన్ దొర‌క‌లేదు. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల‌ర్ (ఏటీసీ) సాయం కూడా తీసుకున్నాం. వారూ ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని నివాసం స‌మీపంలో ఎలాంటి ఎగిరే వ‌స్తువునూ గమ‌నించ‌లేదు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అని దిల్లీ పోలీస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌ధాని నివాసం నో ఫ్లై జోన్‌లో ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే

Leave A Reply

Your email address will not be published.