సుప్రీంకోర్టు మరో ముందడుగు..
- 73 ఏళ్ల న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా.. డిజిటలైజేషన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ దిశగా మరో ముందడుగు పడింది. నేటి నుంచి మూడు కోర్టులు పూర్తిగా పేపర్లెస్ గ్రీన్ హైటెక్ విధానాన్ని అమలు చేయనున్నాయి. 73 ఏళ్ల చరిత్రలో న్యాయవ్యవస్థలో పూర్తిగా పేపర్లెస్గా మారడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోర్టు హాల్లో సైతం గత 50 ఏళ్ల సుప్రీంకోర్టు తీర్పు కాపీలను తొలగించనున్నారు. అన్ని ఫైళ్లను డిజిటల్ మాధ్యమాల ద్వారా చూసే వెసులుబాటు కల్పించనున్నారు.