ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చిస్తున్నారు. ప్రగతి భవన్కు చేరుకున్న అఖిలేష్ యాదవ్కు సీఎం కేసీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాదవ్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్కు చేరుకున్నారు.