అసలు మీరు ఆయనకే పుట్టారా
- సినిమాలలో విలన్ పాత్రకు మీరు సరిపోతారేమో - రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు ప్రజల నుంచి దోచుకోవడం దాచుకోవడమే - సీఎం జగన్మోహన్ రెడ్డిపై హరిరామ జోగయ్య విమర్శల వర్షం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం జగన్మోహన్ రెడ్డిపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. మరోసారి సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవన్నారు. ఆయన హుందాతనంలో 10% కూడా జగన్లో కనిపించడం లేదని తెలిపారు. అందుకనే ‘‘అసలు మీరు ఆయనకే పుట్టారా.. అని ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనిపిస్తోంది. సినిమాలలో విలన్ పాత్రకు మీరు సరిపోతారేమో అని కూడా అనిపిస్తోంది’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.చట్ట ప్రకారం విడిపోయి విడాకులు తీసుకున్న వారు మరో వివాహం చేసుకోవడానికి అభ్యంతరమలేదని తెలిపారు. పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. కళ్యాణ్పై విమర్శించడానికి మరో విషయం లేకనే తమరు ఇలా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని విమర్శిస్తున్నారని.. మరి గత ఎన్నికలలో కేసీఆర్ నుంచి కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకొని ఆంధ్రప్రదేశ్ను తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించారు. తాత రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు ప్రజల నుంచి దోచుకోవడం దాచుకోవడమే కదా అని విమర్శలు గుప్పించారు. ఆ అవినీతి చిట్టాను ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా అంటూ హరిరామ జోగయ్య లేఖలో విరుచుకుపడ్డారు.