మహారాష్ట్రలో ఘోర ప్రమాదంలో 10 మంది మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పివాహనాలను ఢీకొడుతూఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్ధూలేలలోని ఆసుపత్రులకు తరలించిచికిత్స చేయిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంమధ్య ప్రదేశ్ నుంచి ధూలే వైపు వెళ్తున్న లారీ మంగళవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ముంబై-ఆగ్రా హైవేపై పలస్నేర్ గ్రామం సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. దీంతో రెండు మోటారు సైకిళ్లనుఓ కారునుమరో కంటెయినర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో బస్టాప్ పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత తలక్రిందులైంది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిని సిర్పూర్ధూలేలలోని ఆసుపత్రులకు తరలించిచికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం బాధితుల్లో బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.