ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా మంకీపాక్స్‌ కేసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

పంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పంచవ్యాప్తంగా కేసులు 70వేల మార్క్‌ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా కాంటినెంట్‌ దేశాలున్నాయి. చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ సైతం హెచ్చరికలు జారీ చేశారు.ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఈ అంటువ్యాధి అత్యంత ప్రమాదకరమైన సమయం ఇది కావొచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గముఖం పడుతుండగా.. గతవారం 21 దేశాల్లో కేసులు పెరిగాయన్నారు. అమెరికా ఖండంలోని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 90శాతం గుర్తించారు. మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టే సమయం అత్యంత ప్రమాదకరమని టెడ్రోస్‌ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సమయంలో వైరస్‌ తగ్గిందని భావించి జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తామని.. దీంతో మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. పరీక్షల సామార్థ్యం పెంచడంతో పాటు నిఘా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.