బాన్సువాడలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణంలోని బాబు జగ్జీవన్ రాం విగ్రహ ఏర్పాటు స్థలంలో గురువారం భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్బంగా అయన చిత్ర పటానికి బాబు జగ్జీవన్ రాం యువజన సంఘం సభ్యులు ఘాన నివాళులు అర్పించారు. సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా బాబు జగ్జీవన్ రాం యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు కాదేపురం గంగన్న మాట్లాడుతూ రిజర్వేషన్ల భద్రత కోసం బాబూజీ కృషి చేశారని అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కో అప్షన్ కంతి పోశీరాం,ఉపాధ్యక్షులు మారుశెట్టి హన్మండ్లు,ఎంఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్,నాయకులు ఎర్రోళ్ల అశోక్,డప్పు రమేష్,ఎడ్ల మహేష్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.