కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా క్రీడా వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్‌ నగర ఖ్యాతి మరింత ఇనుమడిరపు చేయడానికి నిరంతర కృషి చేస్తున్న యూత్‌ ఐకాన్‌ ‘కేటీఆర్‌’ గారి బర్త్‌డే సందర్భంగా క్రీడా వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి, క్రీడా సంఘాలు ముందుకు రావడం హర్షనీయమని స్పోర్ట్స్‌ అథారిటి ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.వివిధ వర్గాలలో క్రీడల పట్ల ఆసక్తి కల్పించి, రాష్ట్రంలో మంచి క్రీడా వాతావరణం తీసుకురావడానికి స్పోర్ట్స్‌ అథారిటి చేస్తున్న ప్రయత్నాలకు క్రీడా సంఘాలు సహకరిస్తూ, వివిధ ప్రతిపాదనలతో ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.ఈ నెల 24వ తేదిన మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రివర్యులు కె.టి.రామారావు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్రీడా సంఘాలు స్పోర్ట్స్‌ అథారిటి సమన్వయంతో ‘తెలంగాణ క్రీడా వేడుక’ను ఘనంగా నిర్వహిస్తామని ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు. ఈరోజు తెలంగాణ సైక్లింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ల రాష్ట్ర ప్రతినిధులు ఎల్‌బి స్టేడియంలో సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ గారి కార్యాలయంలో సమావేశమై మంత్రి కేటీఆర్‌ గారి జన్మ దినోత్సవం సందర్భంగా క్రీడా వేడుకల్ని నిర్వహించడానికి సహకరించాలని ఛైర్మన్‌కు విన్నపం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్‌ గారు మాట్లాడుతూ క్రీడా ప్రేమికుడైన ‘యూత్‌ ఐకాన్‌’ మంత్రి కేటీఆర్‌ గారి జన్మదినం సందర్భంగా క్రీడా వేడుకల్ని నిర్వహించాలన్న ప్రతిపాదన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని, సంఘాల ఆధ్వర్యంలో జరిగే క్రీడల్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ క్రీడా వేడుకల్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ గారి సహకారంతో సైక్లింగ్‌, రోలర్‌ స్కేటింగ్‌, రెజ్లింగ్‌ (మహిళలు) పోటీలు నిర్వహించడానికి స్పోర్ట్స్‌ అథారిటి తరపున ఆయా క్రీడా సంఘాలకు సంపూర్ణంగా సహకరిస్తామని ఆయన తెలిపారు. వారి సూచనల మేరకు ఈ క్రీడల్ని దిగ్విజయం చేయడానికి సాట్స్‌ సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌. మల్లారెడ్డి, దత్తాత్రేయ, తెలంగాణ ఆమెచ్యుర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు అమ్‌జాబీన్‌ ఓమర్‌ (జాఫర్‌భాయి), కె. నర్సింగ్‌రావ్‌, రోలర్‌ స్కేటింగ్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు, కుషాల్‌రాయ్‌ మహేందర్‌, ధర్మెందర్‌సింగ్‌లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.