జూలై-18న ఎన్డీయే కీలక సమావేశం

-   ఈ సమావేశానికి ఏపీ నుంచి హాజరవుతున్న టీడీపీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:జూలై-18న ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ హాజరవుతోంది. ఇప్పుడీ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెళ్లలో ప్రధాన వార్తగా నిలిచింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతగా సత్సంబంధాలు నడవలేదు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని వార్తలు వస్తుండటంతో అధికారప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుండటం.. ఈ సమావేశానికి టీడీపీ హాజరుకానుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేతమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకూ బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని ఏ నోట చూసినా.. వార్తల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు సడన్‌గా ఎన్డీఏ సమావేశానికి టీడీపీ వెళ్తుండటంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. కాగా.. ఎన్డీఏ సమావేశానికి టీడీపీతో పాటు ఎల్‌జేపీఅకాలీదళ్ తదితర పార్టీలు కూడా హాజరుకాబోతున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఎన్డీఏ ఉన్న భాగస్వామ్యపక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారికి కూడా సమావేశానికి హాజరుకావాలని బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీడీపీ,శిరోమణి అకాళీదళ్లోక్ జనశక్తి (పాశ్వాన్) పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు హోరెత్తుతున్నాయి. 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఈ కీలక సమావేశం జరగబోతోంది. లోక్‌సభ ఎన్నికలుపలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే.. కేంద్రరాష్ర్టాల పార్టీలో మార్పులుచేర్పులు చేశాక ఎన్డీఏ విస్తరణకు కసరత్తు పూర్తి చేసిన తర్వాతే ఇలా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంబీజేపీ ముఖ్యులు కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు.. రెండు మూడ్రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నారు. ఈ కీలక సమావేశానికి లోపే మార్పులుచేర్పులు జరగాలని.. వీలైతే కొత్తగా ఎన్డీఏలో చేరే ఒకట్రెండు పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించిన వేళ ఎన్డీఏ ఇలా పార్టీలను ఆహ్వానించి మరీ సమావేశం ఏర్పాటు చేయడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ సమావేశానికి ఇంకా ఎన్ని పార్టీలు హాజరువుతాయి..? ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది..? ఫైనల్‌గా ఏం జరుగుతుందనే విషయాలు తెలియాలంటే 18వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.