ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ఉప ప్రధాని 37వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సమతాస్తల్ రాజ్ హాట్ లో సమాధి దగ్గర ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి రైల్వే మంత్రిగా డిఫెన్స్ మంత్రిగా ఎన్నో శాఖలను సమర్థవంతంగా నిర్వహించి రాజకీయ నాయకుడిగా ఎంతోమందికి స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని ఇచ్చి రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు బాబు జగ్జీవన్ రామ్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరారు బడుగు బలహీన వర్గాల్లో ఐకమత్యాన్ని పెంచడానికి జై భీమ్ జయరాం నినాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లను ఉన్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగేక్షేత్ర పాల్ రాజన్ చాచాజీ పూజా శర్మ అధిక అధికారి నంది కొండలరావు దినేష్ గుప్తా మనరామరాజ్యం పార్టీ నాయకులు దినేష్ శ్రీదేవి సత్యనారాయణ హైదరాబాద్ సాధన సమితి అధ్యక్షుడు జిఏ నేతాజీ సంఘ సేవకులు డాక్టర్ ఆదినారాయణ అమీర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు