డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీ
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి 31తో ముగియనుంది.