తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాష్ జవదేకర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రకాష్ జవదేకర్‌ను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాజస్థాన్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను ప్రహ్లాద్ జోషికిఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను ఓం ప్రకాష్ మాధుర్‌కు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా భూపేంద్ర యాదవ్‌ను నియమించింది.తెలంగాణలో ప్రకాష్ జవదేకర్‌కు కో-ఇన్‌చార్జిగా సునీల్ బన్సాల్ వ్యవహరిస్తారు. రాజస్థాన్‌లో నితిన్ పటేల్కుల్దీప్ బిష్ణోయ్ కో-ఎలక్షన్ ఇన్‌చార్జులుగాఛత్తీస్‌గఢ్‌కు డాక్టర్ మన్షుఖ్ మాండవీయ కో-ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. మధ్యప్రదేశ్‌లో అశ్విన్ వైష్ణవ్ కో-ఇన్‌చార్జిగా ఉంటారు.

Leave A Reply

Your email address will not be published.