మోసాలకు పాల్పడుతున్న ‘రిలయన్స్ బిల్డర్స్’ అసొసియేషన్

-   ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులు -   కులం పేరుతో దూశించిన బిల్డర్ పై చర్యలు తీసుకోవాలి - దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రేణుకుంట్ల ఎల్లయ్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాము చెల్లించిన డబ్బులు ఇవ్వమని కోరితే డబ్బులు ఇవ్వక పోగా  అగ్రకుల అహంకారంతో కులం పేరుతో దూశించిన బిల్డర్ రాజేష్ పై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రేణుకుంట్ల ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం  హైదర్ గూడ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు కుతాడి క్రిష్ణ ఎరుకల తో కలిసి అయన మాట్లాడుతూ ‘రిలయన్స్ బిల్డర్స్’ అనే పేరుతో బిల్డర్ సోమూరి రాజేశ్ కిరణ్ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ స్థాపించి కొండాపూర్ నందు తనకు ఓనర్స్ ప్లాట్ చూపించి 31 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వెల్లగా బిల్డర్ రాజేష్ మాకు డబ్బులు ఇవ్వలేదని ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆపేశామని అసలు ఓనర్లు వి.కల్పనరెడ్డి భర్త డా.జి.కిరణ్ రెడ్డి తెలిపారని అన్నారు. విషయం తెలుసుకుని సోమూరి రాజేశ్ కిరణ్ ను 31 లక్షలు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీయగా కులం పేరుతో దూషించడమే కాకుండా పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమకు తెలుసంటూ రెండేళ్లుగా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉంది అని తక్షణమే వారందరిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిర్రు యాకస్వామి, కూతాడి కుమార్, చెరుకు రమేష్, కూతాడి మల్లేష్, ఆనంద్ ప్రకాష్, కె.విష్ణు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.