తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదు.. యావత్తు భారతీయులది
హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకునేది లేదు : రాజాసింగ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హిందువుల మనోభావాలు దెబ్బతింటే.. సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదని.. యావత్తు భారతీయులదని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చటమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అడిగే వారు లేరన్నట్లు ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. పురాతన మండపానికి మరమ్మత్తులు చేయకుండా.. కూల్చటం తప్పని రాజాసింగ్ అన్నారు.