హైల్ టాటమణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో వృద్దులకు అన్నదానం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైల్ టాటమణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్ కాకుమాను జ్యోతి ప్రాయోజిత మాతా ఫౌండేషన్ వృద్ధాశ్రమం సికింద్రాబాద్ బహదూర్పల్లిలో వృద్దులకు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వృద్దుల యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కాకుమాను జ్యోతి మాట్లాడుతూ మానవ సేవే మాదవ సేవ అని పేదలు ,వృద్దులలు సహాయం చేయడం హైల్ టాటమణి ఛారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు.పి.జగదీష్ కుమార్, జి.రాజు, టి.శేషు, నారాయణ్, రాజేష్ నాయక్, బి.శ్రీనివాస రెడ్డి, పి.ఉషా రాణి, కె.ప్రవీణ్ కుమార్, జి.జగదాంబ, పి.జ్యోష్న, శాంత కుమారి, శ్రీ లక్ష్మి(కడప ) స్వచ్ఛంద సంస్థ సభ్యులతో పాటు మాతా ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఎంఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.