నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి ఇస్తారని అనలేదా?

- కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదా?,  - రేవంత్ రెడ్డి మాటలను రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోన్న బీఆర్ఎస్ - 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదు అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్‌‌లో చెప్పాం. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదా?, నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి ఇస్తారని అనలేదా?, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్‌ను కేంద్రం దృష్టికి ఏనాడైనా తీసుకువెళ్లారా? రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పోలీసు రాజ్యం వస్తుంది. డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు.’’ అని మల్లు రవి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.