జగ్గూభాయ్..పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే..నాకు కోపం రాదా!
- సీయం జగన్పై జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత ఉద్వేగానికి గురయ్యారు. జగన్ పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే.. ఆ భాష చూస్తుంటే చిరాకేస్తుందన్నారు. ‘‘నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను.. నా వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నా.. జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడంటూ’’ భావోద్వేగానికి లోనయ్యారు.ప్రసంగంలో జగ్గూభాయ్ అంటూ సీయం జగన్పై జనసేనాని సెటైర్లు విసిరారు. ప్రసంగం ఆద్యాంతం సీయం జగన్ను జగ్గూభాయ్ అంటూనూ సంబోధించారు. ‘‘నన్ను అన్నా.. నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు.. ప్రజలను అంటే మాత్రం నాకు కోపం వస్తుంది. జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం చాలా బాధేసింది. జగన్ సోదరి పార్టీ పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని అంటున్నారు. మీరు అలా చేస్తారా అని నన్ను అడిగారు. పార్టీని నడపడం చాలా కష్టం.. వేల కోట్లు ఉంటే చాలదు. సైద్ధాంతిక బలం, పోరాటపటిమ, రాజ్యాంగంపై అవగాహన ఉంటేనే పార్టీని నడపగలం. అత్యవసరంగా అధికారంలోకి రావాలని నేను అనుకోవడం లేదు. అలా అనుకుంటే కాంగ్రెస్లోకి వెళ్లి ఏదో పదవి తెచ్చుకునే వాడిని. జగ్గుభాయ్ను ఇంటికి పంపే రోజు వచ్చింది. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. కొందరు వాలంటీర్లు నా దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి, దగ్ధం చేస్తుంటే.. అటువంటి వాటిని అసలు పట్టించుకోను. వైఎస్సార్ను అందరూ దేవుడంటారు.. ఆయన దేవుడు అయితే అంతమంది ఐఏఎస్లు జైలుకు ఎందుకెళ్ళారు. ఆయన అవినీతి చెయ్యబట్టే కదా.. ప్రభుత్వం మారితే కొందరు వాలంటీర్లు ఆ విధంగానే ఇరుక్కుంటారు’’ అంటూ సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.