అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న

- రాజ శేఖర్ గంగ పుత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంబర్ పేట ప్రేమ్ నగర్ లో శ్రీ ముత్యాలమ్మ,నల్ల పోచమ్మ దేవాలయం వద్ద ప్రముఖ వ్యాపారి రావుల వీరేశం ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బి సి విద్యార్ధి విభాగం నాయకుడు రాజ శేఖర్ గంగపుత్ర పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ  మనిషి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా అన్నం లేనిదే జీవించలేమని,ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో  పేద ప్రజలకు అన్నార్థులకు తమకు తోచిన సహాయంగా అన్న దానం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అద్యక్షుడు కోన అంజయ్య గుప్తా,ప్రధాన కార్యదర్శి కొంపరి నరసింహులు,పెంటం యాదగిరి,ముదిగుండ సరోజిని,గెడ్డం మల్లేష్,హరీష్,బి.జె.పి.నాయకుడు తిరుపతి గుప్తా,కె.రామా చందర్,దామోదర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.