పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ కు శ్రీకారం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్మహబూబ్ నగర్నిజామాబాద్నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్మహబూబ్ నగర్‌లో 10 కిలో మీటర్లునిజామాబాద్నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, ఇక 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్ను సంస్థ తెచ్చింది.హైదరాబాద్‌‌లోని బస్‌ భవన్‌లో సోమవారం “పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీఐపీఎస్ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.