బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నాం
- బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమొదీనే ఈ మాట చెప్పాక మేము బీఆర్ఎస్కు బీ టీమ్ ఎలా అవుతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్లోకి వెళ్లకుండా గ్యారంటీ ఇస్తారా? అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బీఆర్ఎస్లో చేరరని ఆయన స్పష్టం చేశారు. 2014, 18లో మూడో వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్లో చేరలేదా? అని నిలదీశారు. జైలుకు బావతో వెళ్లాలని అక్క (కవిత కోరుకుంటున్నట్లు ఉందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు అధిష్టానం నిర్ణయమని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కంటే తాను ఎక్కువే సాధించానని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.