ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు నిరసనల సెగ
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: డోర్నకల్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ రెడ్యానాయక్కు నిరసన సెగల తగిలింది. కురవి మండలం బాలుతండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ను గ్రామస్థులు అడ్డుకున్నారు. రెడ్యానాయక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన తమరు తమ మా గ్రామానికి ఏం చేశావో చెప్పాలని ఊరి పొలిమేర్లోనే ఆయనను ప్రజలు నిలదిశారు. గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు.