గొంతెత్తి అరిచినా.. అపుడు కానరాని మునుగోడు ఇప్పుడు గుర్తొచ్చిందా

.. దత్తత తీసుకుంటా అని కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం, .. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : శాసనసభలో మునుగోడు నియోజకవర్గ సమస్యల‌పై మూడున్నర సంవత్సరాలు గొంతెత్తి అరిచినా అపుడు కానరాని మునుగోడు ఇప్పుడు గుర్తొచ్చి దత్తత తీసుకుంటా అని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి మండలం గానుగుపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దత్తత తీసుకునే దమ్ము నువ్వు నిలబెట్టిన అభ్యర్థికి లేదా? నువ్వెందుకు దత్తత తీసుకోవాలి అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఊరికి పది ఇండ్లు కట్టియ్యమంటే ఊరికి పది బెల్టు షాపులు పెట్టిండు. పింఛన్ ఇస్తున్నాడని కేసీఆర్‌కి ఓటస్తే మీ పిల్లల భవిషత్తు ఖరాబు చేసినట్లే. కేసీఆర్ ఉన్నా లేకున్నా పింఛన్ వస్తుంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తా. అని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.