తెలుగు రాష్ట్రాలలో ఈ రైల్వేస్టేషన్ల లో రూ 20 కె రుచికరమైన భోజనం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రయాణికులకు తక్కువ ధరలో మరిన్ని సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రైల్వేశాఖ తక్కువ ధరకే డ్రింకింగ్ వాటర్ బాటిల్‌ను ప్రత్యేకంగా తీసుకురాగా.. తాజాగా మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణికులకు అతి తక్కవ ధరకే భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొన్ని రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది.హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్ రైల్వేస్టేషన్లలో సాధారణ ప్రయాణికులకు తక్కువ ధరకే మంచి భోజనం రైల్వేశాఖ అందిస్తోంది. ఫ్లాట్‌ఫామ్‌పై జనరల్ కోచ్‌లు ఆగేచోట ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ల ద్వారా రూ.20, రూ.50కే రుచికరమైన భోజనం, స్నాక్స్ అందిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ స్టాళ్లు చాలా ఉపయోగపడనున్నాయి. ఆ రైల్వే స్టేషన్లలో ఐఆర్‌సీటీ వంటశాలలు అందుబాటులో ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భోజనం రిఫ్రెష్‌మెంట్ రూమ్, ఐఆర్‌సీటీసీ జన్ అహార్ ద్వారా భోజనం సరఫరా చేస్తోంది..ఎకానమీ భోజనం ధర రూ.20గా ఉంది. ఈ ప్యాకెట్‌లో ఊరగాయ ప్యాకెట్, 7 పూరీలు, 150 గ్రాముల వెజిటేబుల్ కర్రీ వస్తుంది. ఇక కాంబో ప్యాకెట్ ధర రూ.50గా నిర్ణయించారు. ఇందులో భోజనంతో పాటు స్నాక్స్ లభిస్తాయి. రాజ్మా రైస్, పావ్ భాజీ, చోలే ఖాతురే, చోలే కుల్చే ఉంటాయి. రైళ్లల్లో ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది కొనుగోలు చేసేందుకు వెనుకాడతారు. అంతేకాకుండా టేస్టీగా కూడా అసలు ఉండవు. దీంతో తక్కువ ధరలో రుచికరమైన ఆహారం అందించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.అటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్-కటక్(07165) రైలును వచ్చే నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు, కటక్-హైదరాబాద్(07166) ట్రైన్‌ను ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది. ఇక తిరుపతి-జల్నా, జల్నా-చాప్రా, హైదరాబాద్-గోరక్‌పూర్ మధ్య అక్టోబర్ 1 వరకు పొడిగించింది.

Leave A Reply

Your email address will not be published.