కారు ఢీకొని.. ఒకరి మృతి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ ప్రాంతంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విట్టల మష్ణాజి (65) అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ తరలించారు.