వివేక హత్య కేసులో సిబిఐ చేతులెత్తేసిందా?
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా?. నాలుగేళ్లు అధికారంలో ఉండి జగన్ ప్రభుత్వం ఏం చేసింది?. సీబీఐ ఛార్జ్షీట్ అబద్ధమైతే, నాలుగేళ్లు అధికారంలోఉండి జగన్ రెడ్డి ఎందుకు నిజాలు కనిపెట్టలేకపోయాడు?. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరి పాత్రఏమిటో సీబీఐ స్పష్టంగా తేల్చాకకూడా సిగ్గులేకుండా సాక్షిపత్రికలో విషప్రచారం చేస్తారా?. హత్యకేసు విచారణపై చంద్రబాబు వేసిన సిట్ను జగన్ ఎందుకు నీరుగార్చారు?. సీబీఐ అధికారుల్ని బెదిరించడం, వారిపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులతో వారి విధి నిర్వహణను ఎందుకు అడ్డుకున్నారు?. ” జీవీ రెడ్డి ప్రశ్నించారు.“సీబీఐ ఛార్జ్షీట్ అబద్ధమైతే అజయ్ కల్లం, కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలాలు అబద్ధమేనా?. ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండి అజయ్ కల్లం జగన్ ప్రలోభాలకు లొంగి, హత్యకేసు వివరాలు దాచడం సిగ్గుచేటు. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తి, సలహాదారు పదవికోసం వ్యక్తిత్వం చంపుకొని ఇంతకు దిగజారాలా?. వివేకా హత్యకేసు మొత్తం కొలిక్కివచ్చాక జగన్.. అతని అవినీతి మీడియా ఇంకెన్నికట్టుకథలు అల్లుతుందో ప్రజలు గమనించాలి.” అని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.