గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు..హైకోర్టు ఆదేశం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రూప్ – 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించ వద్ధంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి ఎన్ఎస్యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ – 1 ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ యోచిస్తోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్పై సోమవారం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని కోర్టుకు ఏజీపీ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ – 1 ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది.