రెండు నియోజకవర్గాల్లో భాజపా మండలాధ్యక్షుల నియామకం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం లోని ఆయా మండలాలకు భాజపా నూతన మండల అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల అధ్యక్షునిగా సున్నం సాయిలు, బీర్కూర్ అధ్యక్షునిగా చంద్రశేఖర్, బాన్సువాడ గ్రామీణ అధ్యక్షునిగా వడ్ల శేఖర్ లను నియమించగా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ అధ్యక్షునిగా నరేష్, పెద్దకొడపగల్ మండల అధ్యక్షునిగా బాలాజీ పటేల్ లను నియమించినట్లు జిల్లా భాజపా అధ్యక్షురాలు అరుణతార ఒక ప్రకటన ద్వారా తెలిపారు.