ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు విముక్తి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:  ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు విముక్తి లభించింది. మావోలతో లింకు ఉన్న కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్‌ బెంచ్‌ ఆ కేసులో ప్రొఫెసర్‌ సాయిబాబాను నిర్ధోషిగా తేల్చింది. తక్షణమే ఆయన్ను జైలు నుంచి రిలీజ్‌ చేయాలని కూడా ఆదేశించారు.జస్టిస్‌ రోహిత్‌ డియోఅనిల్‌ పన్సరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 2017లో ట్రయల్‌ కోర్టు సాయిబాబాను దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును ప్రొఫెసర్‌ సాయిబాబా సవాల్‌ చేశారు. ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్‌చైర్‌పై ఉంటున్నాడు. నాగపూర్‌లోని సెంట్రల్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు.ఇదే కేసుతో లింకు ఉన్న మరో అయిదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించారు. ఓ వ్యక్తి మాత్రం కేసు విచారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ వీళ్లంతా మరో కేసులో లేకుంటే వాళ్లను వెంటనే రిలీజ్‌ చేయాలని బెంచ్‌ ఆదేశించింది. 2017లో గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్‌ కోర్టు సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.