ఇన్స్టా లో పరిచయమైన వ్యక్తితో ఎఫైర్

.. భర్తను హత్య చేసిన భార్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పెళ్లై, పిల్లలు ఉన్నా.. కొంతమంది శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. కుటుంబ బాధ్యతలు, సంపాదనలో భర్త బిజీగా ఉంటే.. మరో వ్యక్తితో ఎఫైర్‌ పెట్టుకుంటున్నారు.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడం.. అందులో అడ్డమైన సోషల్‌ మీడియా యాప్‌లు అన్నీ ఉండడంతో.. కొత్త పరిచయాల కోసం పరితపించిపోతున్నారు.. ఇక, ఆ పరిచయాలు కాస్తా వివాహేతర సంబంధాలకు దారితీయడం.. అడ్డుగా ఉన్న భర్తను, పిల్లలను కూడా చంపేందుకు వెనుకాడడం లేదు.. తాజాగా, ఏలూరు జిల్లాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. నారాయణపురంలోని టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంగుటూరు మండలం నారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. అయితే, తన భర్తను హత్య చేశారని భువనేశ్వరి పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది.. విచారణ చేపట్టిన నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాష్, చేబ్రోలు ఎస్ఐ స్వామి.. మృతుడి మెడమీద పొదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచినట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిసాయి.

మృతుడు చంద్రశేఖర్‌ భార్య భువనేశ్వరికి తాడేపల్లిగూడెంకు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు పోలీసులు.. ప్రియుడితో కలిసి తన భర్తను భువనేశ్వరే హతమార్చినట్టు తేల్చారు. అయితే, భువనేశ్వరికి ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడట.. అదికాస్తా శృతిమించి వివాహేతర సంబంధానికి దారితీయగా.. తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భువనేశ్వరి.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది.. ఇక, ఈ కేసుల్లో మరిన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.