బంధుల పేరుతో కేసీఆర్ డ్రామాలు

: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బంధుల పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు,బీఆర్ఎస్ ప్రభుత్వంబంద్ అయ్యే రోజులు దగ్గర పడడంతోనే డ్రామాలు ఆడుతున్నారని ఓటమి భయం ఎక్కువైందని భువనగిరిఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ సిబ్బందిధర్నాకు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు కరోనాసమయంలో ఎంతో పోరాడారని… కార్మికులు ధర్నా చేయబట్టి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కనీస వేతనం అమలు చేయాలని కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలిపేది లేదన్న కేసీఆర్ ఇప్పుడు విలీనం చేశారన్నారు. ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్ప్రభుత్వం వస్తుందని.. పంచాయతీ కార్మికుల జీతం పెంచుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.