తెలంగాణ అసెంబ్లీ ఎదుట కలకలం.. రైతు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి హఠాత్తుగా అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామ రైతుగా పోలీసులు గుర్తించారు. గన్‌పార్కు దగ్గర పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.భూ సేకరణలో తనకు అన్యాయం జరిగిందని అన్నదాత వాపోయాడు. 2000 ఎకరాల భూసేకరణ చేసినా ప్రభుత్వం తనకు ఇంకా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave A Reply

Your email address will not be published.